Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుల మధ్య అమ్మాయి గొడవ, మధ్యలోకెళ్లిన తెరాస నేత దారుణ హత్య

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (14:08 IST)
తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయి విషయమై కొంతమంది ఆకతాయి కుర్రాళ్లు గొడవపడ్డారు. అలా గొడవపడవద్దంటూ వారించబోయిన తెరాస నాయకుడుని సదరు కుర్రాళ్లు దారుణంగా పొడిచి చంపారు.
 
వివరాల్లోకి వెళితే... నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామంలో మంగళవారం రాత్రి మృతుడు లతీఫ్‌ సోదరుడు జహంగీర్‌ కుమారుడు తన వాట్సాప్‌ స్టేట్‌స్ లో ఓ యువతికి పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెపుతూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టును చూసిన ఎస్సీ కాలనీకి చెందిన కొందరు యువకులు నేరుగా జహంగీర్ కుమారుడిపై లతీఫ్ షాపు ఎదుటే దాడి చేయడం ప్రారంభించారు. ఇది చూసన లతీఫ్ వారిని వారించబోయాడు. 
 
ఇలాంటి తగాదాలు ఇక్కడ రాత్రివేళల్లో చేయవద్దనీ, రేపు ఉదయం వివరంగా మాట్లాడుకోవచ్చని నచ్చజెపుతుండగా యువకులు అతడిపైన కూడా దాడి చేశారు. కత్తితో లతీఫ్‌ను పొడిచారు. దీనితో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments