Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుల మధ్య అమ్మాయి గొడవ, మధ్యలోకెళ్లిన తెరాస నేత దారుణ హత్య

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (14:08 IST)
తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయి విషయమై కొంతమంది ఆకతాయి కుర్రాళ్లు గొడవపడ్డారు. అలా గొడవపడవద్దంటూ వారించబోయిన తెరాస నాయకుడుని సదరు కుర్రాళ్లు దారుణంగా పొడిచి చంపారు.
 
వివరాల్లోకి వెళితే... నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామంలో మంగళవారం రాత్రి మృతుడు లతీఫ్‌ సోదరుడు జహంగీర్‌ కుమారుడు తన వాట్సాప్‌ స్టేట్‌స్ లో ఓ యువతికి పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెపుతూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టును చూసిన ఎస్సీ కాలనీకి చెందిన కొందరు యువకులు నేరుగా జహంగీర్ కుమారుడిపై లతీఫ్ షాపు ఎదుటే దాడి చేయడం ప్రారంభించారు. ఇది చూసన లతీఫ్ వారిని వారించబోయాడు. 
 
ఇలాంటి తగాదాలు ఇక్కడ రాత్రివేళల్లో చేయవద్దనీ, రేపు ఉదయం వివరంగా మాట్లాడుకోవచ్చని నచ్చజెపుతుండగా యువకులు అతడిపైన కూడా దాడి చేశారు. కత్తితో లతీఫ్‌ను పొడిచారు. దీనితో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments