Webdunia - Bharat's app for daily news and videos

Install App

GHMC Mayor post: కేసీఆర్‌ను కలిసిన మేయర్ బొంతు దంపతులు

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (13:07 IST)
KCR_Mayor Couple
హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్ ఎన్నిక నేపథ్యంలో తాజాగా మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. 
 
సతీమణి బొంతు శ్రీదేవీ యాదవ్‌తో కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు. శ్రీదేవి.. చర్లపల్లి కార్పొరేటర్‌. వీరిద్దరూ శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును ప్రగతిభవన్‌లో కలిశారు. కొత్త పాలకమండలి కొలువు దీరనున్న నేపథ్యంలో వారు కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
కాగా మరి కొన్ని రోజుల్లో జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈనెల 11న గ్రేటర్‌లో కొత్త పాలక మండలి కొలువు తీరనుంది. అయితే ఈసారి గ్రేటర్ మేయర్ పీఠం మహిళకు ఇవ్వనున్నారు. దీంతో పలువురు ఆశవహులు మేయర్ పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. మేయర్‌ పదవి రేసులో పలువురి పేర్లు వినిపిస్తోన్న తరుణంలో ప్రస్తుత మేయర్‌ ప్రగతిభవన్‌కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. 
 
ఇప్పటి పాలకమండలి గడువు 10వ తేదీతో ముగియనుంది. మేయర్ సీటు జనరల్ మహిళకు కేటాయించడంతో పలువురు రేసులో నిలుస్తున్నారు. జీహెచ్ఎంసీ ఫలితాలు రాగానే మేయర్ రేసులో భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రస్తుతం ఆమె మేయర్ రేస్ నుంచి వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments