Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్రునయనాల మధ్య ఒకే చితిపై భార్యాభర్తలకు అంత్యక్రియలు

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (12:36 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో దారుణ హత్యకు గురైన వామనరావు న్యాయవాద దంపతులకు స్థానికులు అశ్రునయనాల మధ్య ఒకే చితిపై అంత్యక్రియలు పూర్తిచేశారు. వామనరావు, ఆయన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేసిన విషయం తెల్సిందే. 
 
ఈ జంట హత్యలు తెలంగాణా రాష్ట్రంలో పెను సంచలనంగా మారాయి. ఈ క్రమంలో పెద్దపల్లి ఆస్పత్రిలో గురువారం ఉదయం 10 గంటలకు డాక్టర్లు, పోలీసుల పర్యవేక్షణలో, వీడియో చిత్రీకరణలో పోస్టుమార్టం నిర్వహించారు. 
 
మధ్యాహ్నం 2 గంటలకు మృతదేహాలను వారి స్వగ్రామం గుంజపడుగుకు తరలించారు. సాయంత్రం గోదావరి ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు. వామనరావు, నాగమణి మృతదేహాలను ఒకే చితిపై ఉంచారు. వామనరావు సోదరుడు గట్టు ఇంద్రశేఖర్‌ చితికి నిప్పంటించారు. 
 
మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గట్టు దంపతుల మృతదేహాలకు నివాళులర్పించారు. అంత్యక్రియల్లో హైకోర్టు న్యాయవాదులు రాపోలు భాస్కర్‌రావుతోపాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. నాగమణి స్వస్థలమైన రాజాం నుంచి ఆమె తల్లిదండ్రులు, బంధువులు వచ్చారు. తన కూతురు, అల్లుడిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 
 
వామనరావు దంపతుల హత్యపై అతని తండ్రి కిషన్‌రావు, సోదరుడు ఇంద్రశేఖర్‌లను పోలీసులు మరోసారి విచారించారు. గుంజపడుగుకే చెందిన పూదరి చంద్రయ్య మంథని కోర్టు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడాడని, తన కుమారుడి కదలికలపై అతనే హంతకులకు సమాచారం ఇచ్చి ఉంటాడని కిషన్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments