Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిఫోర్నియాలో విచిత్రమైన కేసు.. భర్త వల్లే కరోనా.. వర్క్ ప్లేస్‌‌లో ఆ నిబంధనలు..?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (12:33 IST)
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో విచిత్రమైన కేసు ఒకటి నమోదైంది. ఓ కుటంబంలో భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకింది. భర్త వల్లే తనకు కరోనా సోకిందన్న క్లారిటీతో ఆ భార్య ఉంది. అందుకే కోర్టు మెట్లెక్కింది. ఆమె ఫిర్యాదు చేసింది భర్తపై కాకపోవడమే ఇక్కడ విచిత్రం. కాలిఫోర్నియాలో రాబర్ట్ కుసీంబా అనే వ్యక్తి 65 ఏళ్ల వ్యక్తి విక్టరీ ఉడ్ వర్క్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 
 
గతేడాది జూలై 16న అతడికి, అతడి భార్య కోర్బీ కుసీంబాకు కరోనా సోకింది. ఇద్దరూ వెంటిలేటర్‌పై ఉండి మరీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అదృష్టవశాత్తు బయటపడగలిగారు. అయితే రాబర్ట్ భార్య కోర్బీ ఈ ఘటనపై సీరియస్ అయింది. తన భర్త వల్లే తనకు కరోనా సోకిందన్న నిర్ణయానికి వచ్చింది. అంతేకాకుండా భర్తకు కరోనా రావడానికి కారణం అతడు పనిచేసే కంపెనీయేనన్న ఆరోపణలు చేస్తోంది. 
 
సరైన వర్క్ ప్లేస్‌ను కల్పించకుండా, ఆఫీసులో కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లే తన భర్తకు కరోనా సోకిందనీ, అతడి ద్వారా తనకు కూడా వ్యాప్తి చెందిందన్న ఆరోపణలతో ఆగస్టు నెలాఖరులో కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను అతి త్వరలోనే యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మక్సైన్ ఎం.చెస్నీ విచారించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments