తెలంగాణ రహదారులకు పచ్చదనం కళ

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (08:55 IST)
తెలంగాణలోని అన్నిజాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లు పచ్చదనంతో కళకళలాడేలా అవసరమైన రోడ్ల వెంటనే నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి ఆదేశాలను వెంటనే అమలు చేయాలని నర్సీరీల సంఖ్య నెలకొల్పే ప్రదేశాలను వెంటనే ఖరారు చేయాలని అధికారుల బృందం నిర్ణయించింది. డిఎఫ్‌ఓ, హైవేస్‌, అర్‌అండ్‌బి అధికారులు ఉమ్మడిగా ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు.

జాతీయ రహదారుల వెంట 40 నర్సరీలు, రాష్ట్రహైవేస్‌లో 69, రోడ్లు భవనాలశాఖ పరిధిలో రహదారుల వెంట 141 మొత్తం 250 నర్సరీలను ఏర్పాటు చేయనున్నారు. 
 
ఒక్కోనర్సరీలో 40 వేల చొప్పున మొత్తం కోటి పెద్ద మొక్కలు పెంచేలా, వాటిని అన్నిరోడ్లకు రహదారి వనాలు(ఎవెన్యూ ప్లాంటేషన్‌) కోసం ఉపయోగించాలని నిర్ణయించారు.

ఈ నర్సరీల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులను వాడుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. వెంటనే నర్సరీలను ప్రారంభించి వచ్చే సీజన్‌కల్లా మొక్కలు నాటేలా ప్లాన్‌ చేయాలని అధికారుల బృందం నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పిల్లలను వదిలేశాడు.. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు.. పవన్‌పై పూనమ్ ఫైర్

క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ .. ఇండస్ట్రీ అద్దం లాంటిది

స్పిరిట్ చిత్రంలో ప్రభాస్‌తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారా?

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments