Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో కరోనా నమూనాల సేకరణ నిలిపివేత!.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

Advertiesment
Corona samples
, శుక్రవారం, 26 జూన్ 2020 (11:48 IST)
కరోనా పరీక్షల పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, రెండు రోజుల పాటు నమూనాల సేకరణను నిలిపివేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే ల్యాబుల్లో నమూనాలు పేరుకుపోగా, నిన్నటికి 8,253 నమూనాలను పరీక్షించాల్సిన పరిస్థితి వుంది. వీటిని మరిన్ని రోజులు నిల్వ ఉంచితే తప్పుడు రిపోర్టులు వస్తాయన్న ఆలోచనతో, వైద్య వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
గడచిన 9 రోజుల వ్యవధిలో 36 వేల మంది నుంచి నమూనాలను అధికారులు సేకరించారు. అయితే, రాష్ట్రంలోని 10 ప్రభుత్వ ప్రయోగశాలల్లో రోజుకు 2,290 రిపోర్టులు మాత్రమే వెలువరించే అవకాశం ఉంది.

దీంతో పరిశీలించాల్సిన నమూనాలు పెరిగిపోయాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, తిరిగి శనివారం నుంచి నమూనాలు తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సికింద్రాబాద్‌లో వస్త్రదుకాణాల బంద్