Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి ప్రాణాలు తీసిన ఐదు రూపాయల నాణెం

Webdunia
బుధవారం, 6 జులై 2022 (13:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భూదాన్ పోచంపల్లి పట్టణంలో విషాదం జరిగింది. ఐదు రూపాయల నాణెం ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఆ చిన్నారి మింగిన ఐదు రూపాయల నాణెం వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీసినప్పటికీ చిన్నారి ప్రాణాలను మాత్రం గుర్తించలేకపోయారు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగింది. 
 
ఈ ప్రాంతంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారిలో చిన్నకుమార్తె చైత్ర (4) అనే చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఐదు రూపాయల నాణాన్ని మింగింది. అయితే, అది గొంతులోనే ఇరుక్కుని పోయింది. ఆ వెంటనే హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్యులు చికిత్స చేసి చిన్నారికి గొంతులో చిక్కుకున్న రూ.5 నాణెను వెలికి తీశారు. కానీ, ఆ చిన్నారి శ్వాసపీల్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ తుదిశ్వాస విడిచింది. నాణెం ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ సోకి చిన్నారి మరణించివుండొచ్చని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments