Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి ప్రాణాలు తీసిన ఐదు రూపాయల నాణెం

Webdunia
బుధవారం, 6 జులై 2022 (13:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భూదాన్ పోచంపల్లి పట్టణంలో విషాదం జరిగింది. ఐదు రూపాయల నాణెం ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఆ చిన్నారి మింగిన ఐదు రూపాయల నాణెం వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీసినప్పటికీ చిన్నారి ప్రాణాలను మాత్రం గుర్తించలేకపోయారు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగింది. 
 
ఈ ప్రాంతంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారిలో చిన్నకుమార్తె చైత్ర (4) అనే చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఐదు రూపాయల నాణాన్ని మింగింది. అయితే, అది గొంతులోనే ఇరుక్కుని పోయింది. ఆ వెంటనే హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్యులు చికిత్స చేసి చిన్నారికి గొంతులో చిక్కుకున్న రూ.5 నాణెను వెలికి తీశారు. కానీ, ఆ చిన్నారి శ్వాసపీల్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ తుదిశ్వాస విడిచింది. నాణెం ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ సోకి చిన్నారి మరణించివుండొచ్చని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments