Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి ప్రాణాలు తీసిన ఐదు రూపాయల నాణెం

Webdunia
బుధవారం, 6 జులై 2022 (13:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భూదాన్ పోచంపల్లి పట్టణంలో విషాదం జరిగింది. ఐదు రూపాయల నాణెం ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఆ చిన్నారి మింగిన ఐదు రూపాయల నాణెం వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీసినప్పటికీ చిన్నారి ప్రాణాలను మాత్రం గుర్తించలేకపోయారు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగింది. 
 
ఈ ప్రాంతంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారిలో చిన్నకుమార్తె చైత్ర (4) అనే చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఐదు రూపాయల నాణాన్ని మింగింది. అయితే, అది గొంతులోనే ఇరుక్కుని పోయింది. ఆ వెంటనే హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్యులు చికిత్స చేసి చిన్నారికి గొంతులో చిక్కుకున్న రూ.5 నాణెను వెలికి తీశారు. కానీ, ఆ చిన్నారి శ్వాసపీల్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ తుదిశ్వాస విడిచింది. నాణెం ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ సోకి చిన్నారి మరణించివుండొచ్చని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments