Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత... కేసీఆర్, చంద్రబాబు సంతాపం

Webdunia
సోమవారం, 29 జులై 2019 (16:25 IST)
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సోమవారం తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన 1959 జూలై 1వ తేదీన జన్మించారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.
 
మంత్రిగా బాధ్యతలు చేపట్టి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారకు. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లోనూ ఆయన మంత్రిగా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ముఖేష్ గౌడ్ 1986లో జాంబాగ్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా కార్పోరేటర్‌గా విజయం సాధించారు.
 
ముఖేష్ గౌడ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విచారాన్ని వ్యక్తం చేశారు. ముఖేష్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలనీ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments