Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేష్ గౌడ్ ఇక లేరు.. వెంటిలేటర్‌పై ఓటేశారు.. తిరిగిరాని లోకాలకు..

Webdunia
సోమవారం, 29 జులై 2019 (16:06 IST)
కేన్సర్ వ్యాధి బారిన పడి కొంతకాలంకా అపోలోలో చికిత్స పొందుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ (60) కన్నుమూశారు. ఏడు నెలల పాటు కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందించారు. 
 
కానీ చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కేబినెట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముఖేష్‌గౌడ్ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతగా ఆయనకు ప్రాధాన్యత దక్కింది. ఆయనకు భార్య.. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 
 
1989లో తొలిసారి మహారాజ్‌గంజ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖేష్.. 2004లో రెండోసారి ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గంలో విజయం సాధించారు. 2009లో మూడోసారి గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. 
 
అనంతరం 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓటమి చెందారు. తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలో గోషామహాల్ నుంచి పోటీచేసిన ఆయన.. ఆరోగ్యం సహకరించకపోవడంతో.. వెంటిలేటర్‌పై వచ్చి ఓటువేశారు. అదే ఆయన చివరి ఓటుగా మిగిలిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments