Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేష్ గౌడ్ ఇక లేరు.. వెంటిలేటర్‌పై ఓటేశారు.. తిరిగిరాని లోకాలకు..

Webdunia
సోమవారం, 29 జులై 2019 (16:06 IST)
కేన్సర్ వ్యాధి బారిన పడి కొంతకాలంకా అపోలోలో చికిత్స పొందుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ (60) కన్నుమూశారు. ఏడు నెలల పాటు కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందించారు. 
 
కానీ చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కేబినెట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముఖేష్‌గౌడ్ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతగా ఆయనకు ప్రాధాన్యత దక్కింది. ఆయనకు భార్య.. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 
 
1989లో తొలిసారి మహారాజ్‌గంజ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖేష్.. 2004లో రెండోసారి ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గంలో విజయం సాధించారు. 2009లో మూడోసారి గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. 
 
అనంతరం 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓటమి చెందారు. తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలో గోషామహాల్ నుంచి పోటీచేసిన ఆయన.. ఆరోగ్యం సహకరించకపోవడంతో.. వెంటిలేటర్‌పై వచ్చి ఓటువేశారు. అదే ఆయన చివరి ఓటుగా మిగిలిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments