Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేష్ గౌడ్ ఇక లేరు.. వెంటిలేటర్‌పై ఓటేశారు.. తిరిగిరాని లోకాలకు..

Webdunia
సోమవారం, 29 జులై 2019 (16:06 IST)
కేన్సర్ వ్యాధి బారిన పడి కొంతకాలంకా అపోలోలో చికిత్స పొందుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ (60) కన్నుమూశారు. ఏడు నెలల పాటు కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందించారు. 
 
కానీ చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కేబినెట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముఖేష్‌గౌడ్ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతగా ఆయనకు ప్రాధాన్యత దక్కింది. ఆయనకు భార్య.. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 
 
1989లో తొలిసారి మహారాజ్‌గంజ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖేష్.. 2004లో రెండోసారి ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గంలో విజయం సాధించారు. 2009లో మూడోసారి గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. 
 
అనంతరం 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓటమి చెందారు. తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలో గోషామహాల్ నుంచి పోటీచేసిన ఆయన.. ఆరోగ్యం సహకరించకపోవడంతో.. వెంటిలేటర్‌పై వచ్చి ఓటువేశారు. అదే ఆయన చివరి ఓటుగా మిగిలిపోయింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments