Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా వచ్చి దొంగతనం చేసేవారు..

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (12:16 IST)
హైదరాబాదులో ఇళ్లల్లోని ల్యాప్‌టాప్‌లను దొంగలించే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన పాటిల్‌ శివాజీ(23), బోయిన్‌ వెంకటేశం (21), అజ్జంపల్లి గోవర్ధన్‌రెడ్డి (23) ముగ్గురు స్నేహితులు.
 
వీరిలో వెంకటేశం, గోవర్ధన్‌రెడ్డి కూకట్‌పల్లి ఎల్లమ్మబండలో ఉంటూ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత వీరితో పాటిల్‌ శివాజీ కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయసాగారు. కొద్దిరోజులుగా ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తూ రెక్కీ నిర్వహించారు. 
 
ఇళ్లలోని కిటికీలు, తలుపుల వద్ద ఉన్న వస్తువులను తస్కరించేవారు. ఇలా కూకట్‌పల్లి ప్రాంతంలో ఏడు ల్యాప్‌టాప్స్‌, ఐప్యాడ్‌ను దొంగిలించారు. ఈనెల 22న ల్యాప్‌టాప్‌లను కేపీహెచ్‌బీకాలనీలోని పద్మావతి ప్లాజాలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు బైకు(టీఎస్15ఈడబ్ల్యూ8823)పై వచ్చారు. 
 
అక్కడే తనిఖీలు చేస్తున్న క్రైం సిబ్బందికి వీరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొన్నారు. విచారించగా చేసిన నేరాలను ఒప్పుకొన్నారు. వారినుంచి ఏడు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌, బైకును స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు క్రైం సీఐ ఆంజనేయులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్ కి రమ్మని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments