Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా వచ్చి దొంగతనం చేసేవారు..

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (12:16 IST)
హైదరాబాదులో ఇళ్లల్లోని ల్యాప్‌టాప్‌లను దొంగలించే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన పాటిల్‌ శివాజీ(23), బోయిన్‌ వెంకటేశం (21), అజ్జంపల్లి గోవర్ధన్‌రెడ్డి (23) ముగ్గురు స్నేహితులు.
 
వీరిలో వెంకటేశం, గోవర్ధన్‌రెడ్డి కూకట్‌పల్లి ఎల్లమ్మబండలో ఉంటూ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత వీరితో పాటిల్‌ శివాజీ కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయసాగారు. కొద్దిరోజులుగా ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తూ రెక్కీ నిర్వహించారు. 
 
ఇళ్లలోని కిటికీలు, తలుపుల వద్ద ఉన్న వస్తువులను తస్కరించేవారు. ఇలా కూకట్‌పల్లి ప్రాంతంలో ఏడు ల్యాప్‌టాప్స్‌, ఐప్యాడ్‌ను దొంగిలించారు. ఈనెల 22న ల్యాప్‌టాప్‌లను కేపీహెచ్‌బీకాలనీలోని పద్మావతి ప్లాజాలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు బైకు(టీఎస్15ఈడబ్ల్యూ8823)పై వచ్చారు. 
 
అక్కడే తనిఖీలు చేస్తున్న క్రైం సిబ్బందికి వీరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొన్నారు. విచారించగా చేసిన నేరాలను ఒప్పుకొన్నారు. వారినుంచి ఏడు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌, బైకును స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు క్రైం సీఐ ఆంజనేయులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments