చేపల కోసం చెరువులో వలేసిన జాలర్లు.. ఏం పడిందో చూసి షాక్

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:17 IST)
చేపల కోసం చెరువులో వలేసిన జాలర్లు అదిరిపడ్డారు. చేపల వలలో 100 కేజీలకు పైగా బరువున్న భారీమొసలి చిక్కుకోవడంతో అందరూ షాకయ్యారు. దాన్ని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.
 
చేపల వేట కోసం చెరువులోకి దిగిన ఆ మత్స్యకారులకు ఊహించని షాక్ తగిలింది. ఊర చెరువులో చేపల కోసం వేసిన వలలో భారీ మొసలి చిక్కడంతో గుండె ఆగినంత పనైంది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బొమ్మాయికుంటలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన మత్స్యకారులు పెసరి శివ, స్వామి, రాములు రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి కూడా చేపలు పట్టడం కోసం ఊర చెరువులో వలలు ఏర్పాటు చేశార

బుధవారం వలలో పడిన చేపలను బయటికి తీసేందుకు రాగా భారీ మొసలి చిక్కుకుని కనిపించింది. సుమారు 100 కిలోలకు పైగా బరువున్న మొసలిని బంధించేందుకు రెండు గంటల పాటు శ్రమించి బంధించారు.

అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు దాన్ని స్వాధీనం చేసుకుని పాకాల సరస్సులో విడిచిపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavala Shyamala: క్షీణిస్తున్న సీనియర్ న‌టి పావలా శ్యామల ఆరోగ్యం - కూతురికి అనారోగ్యం

Ram Gopal Varma: రాజమహేంద్రవరంలో రామ్ గోపాల్ వర్మపై కేసు

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments