Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూడిదైన బస్సు.. తప్పిన ప్రమాదం.. ప్రయాణీకులు నిద్రలో వుండగా..?

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (13:40 IST)
ప్ర‌యాణికులు అందరూ నిద్రలో ఉన్న సమయంలో జనగామ ఆర్టీసీ కాలనీ హైవేలో ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు చెలరేగాయి. అయితే తృటిలో పెనుప్రమాదం తప్పింది. డ్రైవరు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించి ప్రయాణికులను కిందికి దింపి వేయడంతో.. అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. 
 
జనగామ ఆర్టీసీ కాలనీ సమీపంలో ప్రమాదవశాత్తు షాక్ సర్క్యూట్ వల్ల ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో TS 04 UD 1089 నెంబర్ గల బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధం అయ్యింది. 
 
సుమారు 26 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఛత్తీస్‌గ‌ఢ్ నుంచి జగదేవపూర్ టు హైదరాబాద్‌కు వెళ్తుండగా లింగాల ఘ‌న్‌పూర్ మండ‌లం నెల్లుట్ల గ్రామం హైవేపై ఉదయం 5:40 గంటల సమయంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. 
 
ఈ విష‌య‌మై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఉద‌యం బ‌స్సులో అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయని స‌మాచారం అందింద‌ని.. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో వ్య‌వ‌హ‌రించ‌డంతో పెనుప్ర‌మాదం త‌ప్పింద‌ని అన్నారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌డుతామ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments