Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాప్ నిర్వాహకుల వేధింపులకు ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (09:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఈ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లికుదురు మండలం కొండెంగలగుట్ట తండాకు చెందిన బానోతు అచ్చాలి - కుస్సా దంపతుల కుమారుడు ఆకాశ్ (22) హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 
 
ఈ విద్యార్థి కొన్ని నెలల క్రితం ఒక రుణ యాప్ ద్వారా రూ.30 వేల రుణం తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు నుంచి ఒత్తిడితో పాటు వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా, పొదుపు సంఘం నుంచి రుణం తీసుకుని చెల్లిద్దామని చెప్పాడు. 
 
ఇంతలో యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన ఆకాశ్.. ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments