Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాది కొత్తగూడెం జిల్లాను వణికిస్తున్న వరుస ఎన్‌కౌంటటర్లు, ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:07 IST)
భద్రాది కొత్తగూడెం జిల్లాను వరుస ఎన్‌కౌంటర్లు వణికిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందోనని ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. చత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన మావోలను నియంత్రించాలని పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుడు చనిపోయాడు.
 
ఈ  ఘటన జరిగిన నాలుగు రోజులకే మరో ఎన్‌కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఈ రెండు ఘటనలతో అడవి ప్రాంతాలలో అలజడి మొదలైంది. తెలంగాణలో అధికార పార్టీ నాయకులే లక్ష్యంగా మావోలు వ్యూహ రచన చేస్తుండడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పదిరోజుల క్రితం మావోయిస్టుల యాక్షన్ టీం సభ్యుడు ఎన్ కౌంటర్లో మరణించాడు.
 
కొత్తగూడెం ఇల్లందుల ఏరియాల్లో మావోలు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు. దీంతో కొత్తగూడెం సుదూర ప్రాంతపు అడవుల్లో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. వరుస ఎన్‌కౌంటర్లు కారణంగా ఏజెన్సీ పల్లెల్లో నిఘా మరింత పెంచారు. అనుమానస్పదంగా తిరుగుతున్న వారిపై ఫోకస్ పెట్టారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments