Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం కోసం ధరలు ఖరారు చేసిన ఈసీ : చికెన్ బిర్యానీ రూ.140

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (14:24 IST)
తెలంగాణ అసెంబ్లీకి వచ్చే నెలాఖరులో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపునకు ఆయా పార్టీల ముమ్మరంగా ప్రచారం చేయనున్నాయి. అయితే, ఈ ప్రచారం కోసం ఒక్కో అభ్యర్థి ఖర్చు చేసే మొత్తంలో కోత విధించింది. తప్పుడు లెక్కలతో ప్రచార వ్యయాన్ని తగ్గించి చూపే అవకాశం లేకుండా ధరల జాబితాను విడుదల చేసింది. ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలకు కాఫీ, టీ, టిఫిన్, బిర్యానీ తదితర వాటికి దేనికెంత అనే వివరాలతో ఒక పట్టికను రూపొందించింది. ఇందులో పేర్కొన్న ధరల ప్రకారమే అభ్యర్థి తన ఖర్చులకు లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఈ ఖర్చు రూ.40 లక్షలకు మించకూడదని తెలిపింది. ఎన్నికల సంఘం విడుదల చేసే జాబితాలో ధరల ఇలా ఉన్నాయి. 
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే సభలలో వేటికి ఎంత ఖర్చు చేయాలన్న ధరలు పరిశీలిస్తే, 
 
ఫంక్షన్ హాల్ రూ.15 వేలు, భారీ బెలూన్ రూ.4 వేలు, ఎల్.ఈ.డీ తెర రూ.15 వేలు, డీసీఎం వ్యాను రూ.3 వేలు, మినీ బస్సు రూ.3500, పెద్ద బస్సు రూ.6 వేలు, ఇన్నోవా రూ.6 వేలు, డ్రోన్ కెమెరా రూ.5 వేలు, పెద్ద సమోసా రూ.10 వేలు, లీటర్ వాటర్ బాటిల్ రూ.20, పులిహోర రూ.30, గ్రామీణ ప్రాంతాల్లో అయితే, పులిహోర రూ.20, టిఫిన్ రూ.35, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30, సాదా భోజనం రూ.80, వెజిటబుల్ బిర్యానీ రూ.80, గ్రామీణ ప్రాంతాల్లో రూ.70, చికెన్ బిర్యానీ రూ.140, గ్రామాల్లో రూ.100, మటన్ బిర్యానీ రూ.180, గ్రామీణ ప్రాంతాల్లో రూ.150 చొప్పున ఖర్చు చేయాల్సివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments