ఏపీలో కేసీఆర్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరణ!

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (08:59 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితికి కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో కూడా పోటీ చేసి తన ఉనికిని చాటుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్‌కు ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది. ఆంధ్రాలో ఆ పార్టీ రాష్ట్ర పార్టీ హోదాను ఉపసంహరించుకుంది. ఎన్నికల సింబల్స్ ఆర్డర్ 1968 పేరా 6 ప్రకారం ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
సాధారణంగా రాష్ట్ర పార్టీగా గుర్తింపుపొందాలంటే ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లుకానీ, మొత్తంగా అసెంబ్లీ స్థానాల్లో 3 శాతం సీట్లుగాని సాధించివుండాలన్న నిబంధన ఉంది. అటు 25 ఎంపీ సీట్లకు కనీసం ఒకటైనా గెలిచి ఉండాలి. పార్టీ అభ్యర్థులకు కనీసం 8 శాతం ఓట్లయినా వచ్చివుండాలి. ఈ ప్రకారంగా చూస్తే ఏపీలో బీఆర్ఎస్‌ ఒక్కసారిగా కూడా పోటీ చేయలేదు. అందువల్లే ఏపీలో బీఆర్ఎస్‌కు రాష్ట్ర పార్టీ హోదా దక్కలేదు. తెలంగాణాలో మాత్రం బీఆర్ఎస్‌కు రాష్ట్ర పార్టీ హోదా ఇస్తున్నట్టు ఈసీ తన ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments