Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయిన ఈనాడు విలేకరి: కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి హరీశ్ రావు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (18:02 IST)
కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభణ బీభత్సాన్ని సృష్టిస్తోంది. గతంలో కరోనా సోకినా హోం క్వారెంటైన్లో వుండి క్రమంగా కోలుకున్న పరిస్థితులు వున్నాయి. కానీ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా వుంటోంది. ఎంతోమంది పొట్టనబెట్టుకుంటోంది. ఈనాడులో గత పదిహేడేళ్లుగా కంట్రిబ్యూటర్‌గా విధులు నిర్వర్తించే చింతా నాగరాజుకి కరోనా సోకింది.
 
దుబ్బాకకు చెందిన నాగరాజుకి పది రోజుల క్రితం కరోనా వచ్చింది. దీనితో మెరుగైన చికిత్స చేయించుకునేందుకు హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. ఐతే బుధవారం నాడు వున్నట్లుండి తీవ్ర అస్వస్థతకు లోనై ప్రాణాలు విడిచారు.
 
43 ఏళ్ల చింతా నాగరాజు మరణం పట్ల తెలంగాణ మంత్రి హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఆత్మీయుణ్ణి కోల్పాయానని ఆవేదన వ్యక్తం చేసారు. నాగరాజు మరణించడానికి ఓ గంట ముందు కూడా అతడితో మాట్లాడాననీ, తిరిగి కోలుకుంటారని అనుకున్నాననీ, కానీ ఆయనను కాపాడుకోలేకపోయామని అన్నారు. నాగరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments