Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బుల్లేవు, అందుకే బిడ్డను అమ్మేశామంటున్న తల్లిదండ్రులు

Webdunia
గురువారం, 7 మే 2020 (18:32 IST)
ఆర్థిక ఇబ్బందులు చంటి బిడ్డను అమ్ముకునే స్థాయికి దిగజార్చాయి. మెదక్ జిల్లా చిలిప్‌చేడ్ మండలం చిటుకుల్ తండాలో శిశువును డబ్బు కోసం విక్రయించిన ఘటన చోటుచేసుకుంది. కేవలం 5 వేల రూపాయలకు పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కనికరం లేకుండా అమ్మేశారు. 
 
వివరాల్లోకి వెళితే సదరు తల్లిదండ్రులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మూడవ కాన్పు కూడా ఆడపిల్ల కావడంతో నిరాశ చెందారని, 4 రోజుల బిడ్డను అమ్ముకోవడానికి సిద్ధపడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే తమ కొడుక్కి పుట్టిన మూడో ఆడపిల్లను అమ్మేసి, కొడుకుకి రెండో పెళ్లి చేయాలని కుటుంబపెద్దలు నిర్ణయించినట్లుగా కూడా వాదనలు వస్తున్నాయి. 
 
ఆడ శిశువును కొనుక్కున్నవారికి పిల్లలు లేకపోవడంతో బిడ్డను తీసుకున్నారని చెబుతున్నారు. ఇదంతా ప్రక్కన బెట్టి తల్లిదండ్రులను ప్రశ్నిస్తే ఆర్థిక సమస్యలు ఉండటం వల్ల బిడ్డను విక్రయించామని చెప్పుకొస్తున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments