Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్తి కోసం భర్త కళ్లముందే.. అత్తమామను కడతేర్చిన కోడలు

ఆస్తి కోసం భర్త కళ్లముందే.. అత్తమామను కడతేర్చిన కోడలు
, శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:24 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. కరోనా లాంటి వ్యాధులొచ్చినా మనుషులు మారట్లేదు. ప్రాణాల విలువ తెలియకుండా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా తన భర్త కళ్ల ముందే అతని తల్లిదండ్రులను భార్య హత్య చేసిన దారుణ ఉదాంతం పశ్చిమ ఢిల్లీలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, ఛావ్లా ప్రాంతంలో ఉంటున్న సతీశ్ సింగ్(37), భార్య కవిత(35).. ఆమె అత్తామామలు రాజా సింగ్(61), ఓంవతి(58)లను గొంతునులిమి.. ఆ తర్వాత కత్తితో పొడిచి హత్య చేసిందని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో వాళ్ల పిల్లలకు కూడా ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. 
 
ఇద్దరి మృతదేహాలు బెడ్‌రూంలో దొరికాయని.. వాళ్ల ముఖాలపై కత్తిగాట్లు ఉన్నాయని వెల్లడించారు. ఆస్తి వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాధమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కవిత, సతీశ్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఆరు నెలల పాటు ఎన్నికలు వద్దు: బీజేపీ