Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంసెట్‌‍లో వెయిటేజీ మార్కులు శాశ్వతంగా రద్దు.. తెలంగాణ సర్కారు నిర్ణయం?

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (10:16 IST)
ఎంసెట్‌లో ఇంటర్ మార్కుకు 25 శాతం వెయిటేజీని ఇస్తూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఈ వెయిటేజీ మార్కులను శాశ్వతంగా తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కరోనా ప్రభావంతో గత మూడేళ్ల నుంచి ఎంసెట్ ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇదే విధానాన్ని పాటించాలని నిర్ణయించారు. దీనిపై తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. 
 
జేఈఈ వంటి వాటిల్లో మార్కుల వెయిటేజీ పద్దతి లేకపోవడంతో ఎంసెట్‌లో కూడా దీన్ని తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీంతో ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఇక ఎంసెట్ పరీక్షలో మొదట గణితం, ఆ తర్వాత ఫిజిక్స్, చివరగా కెమిస్ట్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించారు. 
 
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వస్తున్నందన ఒకటికి మించి ఎక్కువ ప్రశ్నపత్రాలు ఉండటంతో మార్కులు కాకుండా పర్సంటైల్‌ను లెక్కిస్తున్నారు. ఈ పర్సంటైల్ కూడా ఒకటే వస్తే పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుని ఎవరు పెద్దవారు అయితే వారికి మెరుగైన ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఇపుడు ఈ వెయిటేజీ మార్కులను శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఈ యేడాది మే 7 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments