Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో భారీగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు..ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 21 మే 2020 (06:27 IST)
లాక్ డౌన్ ప్రారంభం అయిన తరువాత హైదరాబాదు నగరంలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను ఆపేసిన పోలీసులు, మద్యం విక్రయాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా, ఇంతవరకూ వాటిని నిర్వహించలేదు.

సాయంత్రం 6 గంటలకు మద్యం షాపులను మూసి వేస్తుండటం, 7 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుండటమే దీనికి కారణం.

ఇక మొన్నటి నుంచి భారీ స్థాయిలో లాక్ డౌన్ సడలింపులు అమలులోకి రావడంతో అనుమానితులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.

దీంతో పుత్లిబౌలి చౌరస్తాలో బోల్తా కొట్టిన ఆటో డ్రైవర్ కు పరీక్షలు నిర్వహించగా, 187 బీఏసీ కౌంట్ వచ్చింది. దీంతో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, మాస్క్ లు లేకుండా బయటకు వచ్చిన వారిపైనా పోలీసులు కొరడా ఝళిపించారు.

మాస్క్ లేనివారిపై రూ. 1000 జరిమానా విధిస్తున్నామని, మంగళవారం నాడు జంట నగరాల పరిధిలో 395 మందిపై జరిమానా విధించామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments