కరోనా విషయంలో ఆందోళన వద్దు: సీఎం కేసీఆర్

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (20:11 IST)
కరోనా వ్యాప్తి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిజ్వి, ఆరోగ్య శాఖ వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
 
కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని తెలిపారు. అదే సందర్భంలో నిర్లక్ష్యంగా ఉండరాదని తెలిపారు. కరోనా వైరస్ సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందనవసరం లేదని అన్నారు.
 
ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. కరోనా నివారణలోనూ, చికిత్స లోనూ సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువని సీఎం తెలిపారు. రికవరీ రేటు 67 శాతం ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం అదనంగా రూ.100 కోట్లు కేటాయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments