Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌పై మండిపడిన డీకే అరుణ.. కోట్లతో ఓట్లు కొనుక్కోవడమే తెలుసు

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (16:59 IST)
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచేసిన అవినీతి సొమ్మంతా ఉందని.. ఆ డబ్బుతో ఎలాగైనా టీఆర్ఎస్ గెలవాలని చూస్తోందన్నారు డీకే అరుణ. నాదే అధికారం అనే గర్వం, భ్రమలో కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు. 
 
కిషన్ రెడ్డి ర్యాలీలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఉప ఎన్నిక చూసి భయపడుతావా అంటూ కౌంటర్లు వేశారు. కేసీఆర్ కు ఎన్నికలు అంటే కోట్లతో ఓట్లు కొనుక్కోవడమే తెలుసని చురకలంటించారు.
 
అసలు.. కేసీఆర్‌ను చూస్తుంటే జాలేస్తోందన్నారు డీకే అరుణ. గెలుపు కోసం రోజుకో అబద్ధం ఆడుతున్నారని ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి ఇచ్చే ఉద్దేశం లేక, అమలు చేయలేక బీజేపీ మీద ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఖజానా మొత్తం ఖాళీ చేసి ప్రభుత్వ భూములు అమ్ముతున్న కేసీఆర్ కు.. దళిత బంధు డబ్బులు ప్రజలకు ఇచ్చే ఉద్దేశమే లేదని చెప్పారు.
 
బీజేపీ మొదట్నుంచి దళిత బంధును పేదలందరికీ అందజేయాలని డిమాండ్ చేస్తోందన్నారు డీకే అరుణ. పథకం ప్రకటించి రెండు నెలలు అయినా ఏం చేశారని నిలదీశారు. కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారన్న నమ్మకం ఉందని తెలిపారామె.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments