Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారీకి పట్టకప్పి ఘాతుకానికి పాల్పడ్డారు... సి.సి.కెమెరాలో లారీ

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (21:40 IST)
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు నలుగురిని ఎన్ కౌంటర్ చేసినా సరే ఆ యువతి పడిన బాధ అందరినీ కలచివేస్తోంది. పోలీసుల విచారణలో ఆ యువకులు చెప్పిన మాటలు అలాంటివి. మొదట్లో నలుగురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత లారీలోను అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు.
 
గంటన్నరపాటు అతి దారుణంగా దిశకు నరకం చూపించిన ఆ మృగాళ్ళు ఆ తరువాత లారీలోను అత్యాచారానికి పాల్పడ్డారు. దిశ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో లారీలో అత్యాచారం జరిగిన సమయంలో పట్ట కప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సి.సి. ఫుటేజ్‌ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. లారీ కదిలినప్పటి నుంచే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
 
అయితే పట్ట కప్పి ఉండడం.. పూర్తిగా చీకటి కావడంతో ఎవరూ కూడా ఈ మృగాళ్ళ అకృత్యాలను గుర్తించలేకపోయారు. దీంతో దిశ చివరకు ప్రాణాలను కోల్పోయింది. నిందితులను ఎన్ కౌంటర్ చేసినా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల్లో మాత్రం ఈ ఘటనపై ఇప్పటికీ ఆగ్రహావేశాలు ఏమాత్రం తగ్గడంలేదు. ఒంటరిగా ఉన్న ఒక యువతిపై ఇంత దారుణానికి మృగాళ్ళు పాల్పడటం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments