Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మద్యం కుంభకోణం : ఈడీ చార్జిషీటులో కవిత - మాగుంట - శరత్‌ చంద్రారెడ్డి పేర్లు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:37 IST)
ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవిత, ఏపీలోని వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిల పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తయారు చేసిన చార్జిషీటులో చేర్చింది. ఇందులో పేర్కొన్న అంశాలపై జనవరి ఐదో తేదీలోపు వివరణ ఇవ్వాలని సమీర్ సంస్థలకు కోర్టు ఆదేశించింది.
 
ఢిల్లీ లిక్కర్ స్కాములో అరెస్టు అయిన సమీర్ మహేంద్రు కేసులో ఈడీ చార్జిషీటును దాఖలు చేసింది. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లు చేర్చింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన సమీర్ మహేంద్రు. పి.శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్‌ల నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా ఈ చార్జిషీటును ఈడీ రూపొందించింది. 
 
ఇందులో గత యేడాది జనవరి నెలలో హైదరాబాద్ నగరంలోని కవిత ఇంట్లో సమీర్ ఆమెతో సమావేశమైనట్టు పేర్కొంది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, అరుణ్ పిళ్లైతో వ్యాపారం చేయడమంటే కవితతో చేసినట్టేనని సమీర్‌కు హామీ ఇచ్చారని తెలిపింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments