Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత వద్ద ముగిసిన సీబీఐ విచారణ

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (20:40 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కె.కవిత వద్ద సీబీఐ అధికారులు సాగించిన తొలి రోజు విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటలకు పైగా ఈ విచారణ జరిగింది. హైదరాబాద్ నగరంలోని కవిత నివాసంలోనే ఈ విచారణ జరిగింది. 
 
ఇది ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై, దాదాపు ఏడున్నర గంటల పాటు సాగింది. మొత్తం ఐదుగురు సీబీఐ అధికారుల బృందం కవిత నుంచి పలు ప్రశ్నలకు సమాచారం సేకరించింది. అలాగే, లిక్కర్ స్కామ్‍లో సాక్షిగా కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసింది. 
 
లిక్కర్ స్కాం నిందితుడు అమిత్ ఆరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కాగా, 170 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణలపైనా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కవిత గతంలో వాడిన మొబైల్ ఫోన్ల వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments