Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ పరీక్షా విధానంలో మార్పులు.. ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (17:20 IST)
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంటర్ బోర్డు పరీక్షల్లో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ఇంటర్‌లో ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ అమలు చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ఇంటర్‌లో రెండో సంవత్సరంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉంటాయి. కానీ, ఇకపై ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. ఈ మేరకు ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశంలో ప్రాక్టికల్స్ అమలుపై నిర్ణయం తీసుకున్నారు. 
 
వచ్చే విద్యా సంవత్సరం నుంచి వార్షిక పరీక్షల్లో థియరీకి 80 మార్కులు, ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. వార్షిక పరీక్షలే కాకుండా, ఇంటర్నల్ పరీక్షలను కూడా ఇదే విధానంలో నిర్వహించనున్నారు. నూతన విధానం ప్రకారం ఇంటర్ ఇంగ్లీష్ సబ్జెక్టులకు ల్యాబ్ వర్క్ తప్పనిసరికానుంది. దీంతో అన్ని కాలేజీల్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ కోసం ల్యాబ్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments