Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైనేజీ గుంతలో పడి గల్లంతైన టెక్కీ మృతదేహం లభ్యం

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (18:34 IST)
డ్రైనేజీ గుంతలో పడి గల్లంతైన టెక్కీ మృతదేహాన్ని గోల్డెన్ టెంపుల్‌కు సమీపంలో ఉన్న నెక్నంపూర్‌ చెరువులో పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మణికొండలో నివాసముండే గోపిశెట్టి రజనీకాంత్‌ (42) షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 
 
శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్‌ తన ఇంటికి 50 మీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యాడు. ఇలా మణికొండలో నాలాలో శనివారం కొట్టుకుపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతదేహం లభ్యమైంది. 
 
రజనీకాంత్ డ్రైనేజీలో కొట్టుకుపోయారనే సమాచారంతో రెండు డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయచర్యల్లో పాల్గొన్నాయి. నాలాలు కలిసే చోట, నెక్నాంపూర్‌ చెరువు వద్ద గాలింపు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం చెరువులో ఆయన మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గుర్తించి వెలికితీశారు. రజనీకాంత్‌ కోసం రెండ్రోజులుగా 60 మంది సిబ్బంది గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments