Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి అంత్యక్రియలు చేసేందుకు భిక్షాటన చేసిన కుమార్తె

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (22:49 IST)
కన్నతండ్రి పాముకాటుతో కన్నుమూసాడు. అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. దానితో అతడి కుమార్తె జోలె పట్టి భిక్షాటన చేసింది. ఈ హృదయవిదారక ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గ్రామంలో వివేకానంద విగ్రహం వద్ద నాగుపాము కనిపించడంతో దుర్గయ్య అనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. దాంతో అతడు అక్కడికి వచ్చి పామును పట్టుకుని సంచిలో వేస్తుండగా అతడిని పాము కాటు వేసింది. దీనితో దుర్గయ్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

 
ఐతే మార్గమధ్యంలోనే దుర్గయ్య కన్నుమూశాడు. కూలి పనులు చేసుకుంటూ ఏరోజుకారోజు పొట్టపోసుకుని బ్రతుకుతున్న దుర్గయ్య చనిపోవడంతో అతడి అంత్యక్రియలు చేసేందుకు పిల్లల వద్ద పైసా లేకుండా పోయింది. దీనితో అతడి కుమార్తె, కొడుకు ఇద్దరూ గ్రామంలోని ప్రధాన వీధులలో తిరుగుతూ భిక్షాటన చేసారు. వచ్చిన డబ్బుతో తండ్రి అంత్యక్రియలు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments