Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి అంత్యక్రియలు చేసేందుకు భిక్షాటన చేసిన కుమార్తె

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (22:49 IST)
కన్నతండ్రి పాముకాటుతో కన్నుమూసాడు. అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. దానితో అతడి కుమార్తె జోలె పట్టి భిక్షాటన చేసింది. ఈ హృదయవిదారక ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గ్రామంలో వివేకానంద విగ్రహం వద్ద నాగుపాము కనిపించడంతో దుర్గయ్య అనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. దాంతో అతడు అక్కడికి వచ్చి పామును పట్టుకుని సంచిలో వేస్తుండగా అతడిని పాము కాటు వేసింది. దీనితో దుర్గయ్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

 
ఐతే మార్గమధ్యంలోనే దుర్గయ్య కన్నుమూశాడు. కూలి పనులు చేసుకుంటూ ఏరోజుకారోజు పొట్టపోసుకుని బ్రతుకుతున్న దుర్గయ్య చనిపోవడంతో అతడి అంత్యక్రియలు చేసేందుకు పిల్లల వద్ద పైసా లేకుండా పోయింది. దీనితో అతడి కుమార్తె, కొడుకు ఇద్దరూ గ్రామంలోని ప్రధాన వీధులలో తిరుగుతూ భిక్షాటన చేసారు. వచ్చిన డబ్బుతో తండ్రి అంత్యక్రియలు చేసారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments