Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ సోకి మహిళ మృతి .. 800 మంది కార్మికులకు క్వారంటైన్

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (14:12 IST)
కరోనా వైరస్ సోకి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ కాలనీలోని 800 మంది కార్మికులను పోలీసులు హోం క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామ పరిధిలోని కన్హా శాంతివనం అనే కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కన్హా శాంతివనంలో వందలాది మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వీరిలో ఓ మహిళకు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ శాంతివనంను సందర్శించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా శాంతివనంలో పని చేసే 800 మంది కార్మికులను హోంక్వారంటైన్‌కు తరలించాలని ఆదేశించారు. 
 
కలెక్టర్ ఆదేశాల మేరకు చేగూరు గ్రామ సరిహద్దులో చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. గ్రామంలో ఇంకెవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా అని తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments