Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరోనా విశ్వరూపం - 50 వేలకు చేరువలో కేసులు

Webdunia
బుధవారం, 22 జులై 2020 (22:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. దీంతో ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 1554 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది. మొత్తం 37,666 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 76.5 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 9 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 438కి పెరిగింది.
 
24 గంటల్లో నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధి నుంచి 842 కేసులు రావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈరోజు 1,281 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 11,155 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 2,93,077 మందికి టెస్టులు చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
ఆంధ్రాలో కరోనా మరణ మృదంగం 
కరోనా మహమ్మారి దెబ్బకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. రోజురోజుకూ కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామాలకు సైతం కరోనా విస్తరిస్తుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 6,045 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.
 
వీటిలో విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,049 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 325, చిత్తూరు 345, తూర్పు గోదావరి 891, గుంటూరు 842, కడప 229, కృష్ణా 151, కర్నూలు 678, నెల్లూరు 327, ప్రకాశం 177, శ్రీకాకుళం 252, విజయనగరం 107, పశ్చిమగోదావరి జిల్లాలో 672 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64,713కి పెరిగింది.
 
గత 24 గంటల్లో కరోనా బారిన పడి మొత్తం 65 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో 15, కృష్ణలో 10, పశ్చిమగోదావరిలో 8, తూర్పుగోదావరిలో 7, చిత్తూరులో 5, కర్నూలులో 5, విజయనగరంలో 4, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 3, కడప, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 823కి చేరింది. మరిన్ని వివరాల కోసం కింది టేబుల్ చూడండి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments