కరోనా సోకిన గర్భిణి.. ఆంబులెన్స్‌లోనే ప్రసవం.. పండంటి పాప పుట్టిందోచ్..

Webdunia
బుధవారం, 29 జులై 2020 (11:57 IST)
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఈ క్రమంలో కరోనా సోకిన నిండుగర్భిణీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే 108 వాహనంలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన 9 నెలల గర్భిణికి కరోనా సోకింది. దీంతో ఆమె డెలివరీ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే నుంగనూరుకు చెందిన 108 సిబ్బంది ఆమెను హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. 
 
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట వద్దకు వెళ్లే సరికి ఆమెకు పురిటి నొప్పులతో మరింత ఎక్కువ కావడంతో 108 సిబ్బంది డెలివరీ చేశారు. దీంతో ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అదే వాహనంలో హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments