తెలంగాణాలో కరోనా హాట్ స్పాట్‌లు ఏవి?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (15:28 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కేసులన్నింటికి మూలం నిజాముద్దీన్ మర్కజ్ అని నిర్ధారణ అయింది. అందుకే మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వచ్చిన వారిని గుర్తించే పనిలో పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. 
 
ఈ పరిస్థితుల్లో తెలంగాణాలో శుక్రవారం మధ్యాహ్నం వరకు మొత్తం 154 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 9 మంది చనిపోయారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అదుపులో ఉన్నట్టు కనిపించి, ఇపుడు కట్టుతప్పింది. ఫలితంగా తెలంగాణా కంటే అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 161 కేసులు నమోదు కాగా, విజయవాడలో ఓ కరోనా రోగి చనిపోయారు. ఏపీలో నమోదైన కేసులన్నింటికీ మూలకేంద్రం నిజాముద్దీన్ మర్కజ్ అని తేలిపోయింది. 
 
అయితే, నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారు ఎక్కడెక్కడున్నారనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలో మొత్తం 6 ప్రాంతాల్లో వీరు ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్ పాత బస్తీ, భైంసా, నిర్మల్, నిజామాబాద్, గద్వాల్, మిర్యాలగూడ ప్రాంతాలను హాట్ స్పాట్‌లుగా గుర్తించారు. 
 
ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. హాట్ స్పాట్ల నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోకి ఎవరినీ అనుమతించడం లేదు. అక్కడి వారిని బయటకు పంపించడం లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ హాట్‌స్పాట్‌ల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఎగస్ పార్టీ కి దూల తీసి దూపం ఏసేవాడే పెద్ది !

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments