Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరోనా హాట్ స్పాట్‌లు ఏవి?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (15:28 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కేసులన్నింటికి మూలం నిజాముద్దీన్ మర్కజ్ అని నిర్ధారణ అయింది. అందుకే మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వచ్చిన వారిని గుర్తించే పనిలో పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. 
 
ఈ పరిస్థితుల్లో తెలంగాణాలో శుక్రవారం మధ్యాహ్నం వరకు మొత్తం 154 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 9 మంది చనిపోయారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అదుపులో ఉన్నట్టు కనిపించి, ఇపుడు కట్టుతప్పింది. ఫలితంగా తెలంగాణా కంటే అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 161 కేసులు నమోదు కాగా, విజయవాడలో ఓ కరోనా రోగి చనిపోయారు. ఏపీలో నమోదైన కేసులన్నింటికీ మూలకేంద్రం నిజాముద్దీన్ మర్కజ్ అని తేలిపోయింది. 
 
అయితే, నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారు ఎక్కడెక్కడున్నారనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలో మొత్తం 6 ప్రాంతాల్లో వీరు ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్ పాత బస్తీ, భైంసా, నిర్మల్, నిజామాబాద్, గద్వాల్, మిర్యాలగూడ ప్రాంతాలను హాట్ స్పాట్‌లుగా గుర్తించారు. 
 
ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. హాట్ స్పాట్ల నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోకి ఎవరినీ అనుమతించడం లేదు. అక్కడి వారిని బయటకు పంపించడం లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ హాట్‌స్పాట్‌ల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments