Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్నాడు.. ఆరేళ్ల బాలుడు డిశ్చార్జి..

Webdunia
సోమవారం, 4 మే 2020 (22:12 IST)
హైదరాబాదులోని గాంధీ దవాఖానా నుంచి ఆరేళ్ల బాలుడు కరోనా రక్కసి చెర నుంచి బయటపడ్డాడు. సోమవారం అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఢిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన ఒకరి ద్వారా జైనూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా సోకగా, తన నుంచి తన ఆరేళ్ల మనుమడికి అంటుకుంది. 
 
గత నెల 18న పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. బాలుడు కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో మగ్గురు కోలుకున్నారు. మరో నలుగురు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. సోమవారం కేవలం కొత్తగా 3 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1085కు చేరింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
సోమవారం నమోదైన మూడు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. ఇంకా సోమవారం పూట 40మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఫలితంగా మొత్తం 585 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments