Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్నాడు.. ఆరేళ్ల బాలుడు డిశ్చార్జి..

Webdunia
సోమవారం, 4 మే 2020 (22:12 IST)
హైదరాబాదులోని గాంధీ దవాఖానా నుంచి ఆరేళ్ల బాలుడు కరోనా రక్కసి చెర నుంచి బయటపడ్డాడు. సోమవారం అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఢిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన ఒకరి ద్వారా జైనూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా సోకగా, తన నుంచి తన ఆరేళ్ల మనుమడికి అంటుకుంది. 
 
గత నెల 18న పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. బాలుడు కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో మగ్గురు కోలుకున్నారు. మరో నలుగురు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. సోమవారం కేవలం కొత్తగా 3 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1085కు చేరింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
సోమవారం నమోదైన మూడు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. ఇంకా సోమవారం పూట 40మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఫలితంగా మొత్తం 585 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments