మరో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (12:34 IST)
తెలంగాణలో మరో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ఎమ్మెల్యే తెలిపారు.

గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు వెంటనే కోవిడ్‌ పరీక్ష చేయించుకుని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

కరోనా చికిత్స చేయించుకుంటున్న కారణంగా కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరు ఫోన్‌ చేయొద్దని, అలాగే కలవటానికి కూడా ప్రయత్నించవద్దని ప్రజలకు ప్రకాష్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రెండో విడత కాస్తా తగ్గినప్పటికీ అనిపించినా మళ్లీ కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. దీంతో ప్రజలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar: క్రేజీ కల్యాణం మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్

Toxic: postponed: యుద్ధం కారణంగా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్: విడుదల వాయిదా

Chiranjeevi 158: ఉగాదికి ముందే షూటింగ్ కు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments