Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడెంలోకి రానివ్వలేదనీ చెరువులో దూకిన విద్యార్థిని.. తర్వాత..

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (10:32 IST)
కరోనా వైరస్ సోకలేదనీ వైద్యులు నిర్ధారించినప్పటికీ.. గ్రామస్థులు మాత్రం గ్రామంలోకి అడుగుపెట్టనీయలేదు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్థాపానికిలోనై చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పెద్దగోళ్ళగూడెంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్దగోళ్ళగూడెంకు చెందిన ఓ యువతి మహారాష్ట్రలో అగ్రికల్చర్ విభాగంలో విద్యాభ్యాసం చేస్తోంది. ఈమె నానా తంటాలుపడి కొత్తగూడెంకు చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు ఆ యువతి వద్దకు చేరుకుని, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా నెగెటివ్ అని తేలింది. అయినప్పటికీ అధికారులు మాత్రం హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆ యువతిని ఆదేశించారు. అయితే, గూడెంవాసులు మాత్రం ఆ యువతిని గ్రామంలోకి అడుగుపెట్టనీయలేదు. 
 
దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆ యువతి... చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆ యువతిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments