Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడెంలోకి రానివ్వలేదనీ చెరువులో దూకిన విద్యార్థిని.. తర్వాత..

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (10:32 IST)
కరోనా వైరస్ సోకలేదనీ వైద్యులు నిర్ధారించినప్పటికీ.. గ్రామస్థులు మాత్రం గ్రామంలోకి అడుగుపెట్టనీయలేదు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్థాపానికిలోనై చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పెద్దగోళ్ళగూడెంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్దగోళ్ళగూడెంకు చెందిన ఓ యువతి మహారాష్ట్రలో అగ్రికల్చర్ విభాగంలో విద్యాభ్యాసం చేస్తోంది. ఈమె నానా తంటాలుపడి కొత్తగూడెంకు చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు ఆ యువతి వద్దకు చేరుకుని, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా నెగెటివ్ అని తేలింది. అయినప్పటికీ అధికారులు మాత్రం హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆ యువతిని ఆదేశించారు. అయితే, గూడెంవాసులు మాత్రం ఆ యువతిని గ్రామంలోకి అడుగుపెట్టనీయలేదు. 
 
దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆ యువతి... చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆ యువతిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments