Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్... ఆ గ్రామంలోకి తల్లికైనా నో ఎంట్రీ

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (13:52 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్న ఓ గ్రామ సర్పంచ్‌ పంచాయతీ నిర్ణయానికి కట్టుబడి సొంత తల్లికే ప్రవేశం నిరాకరించాడు.

బంధువుల ఇంటి నుంచి వచ్చిన తల్లిని తిప్పి పంపించేశాడు. ఈ సంఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండల పరిధిలోని గోసాయిపల్లిలో జరిగింది.

సిర్గాపూర్‌ మండల కేంద్రంలో మూడు కుటుంబాలను క్వారంటేయిన్‌లో ఉంచడంతో అప్రమత్తమైన గోసాయిపల్లి వాసులు గ్రామ శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి బయటి నుంచి ఎవరూ రాకుండా కట్టడి చేశారు.

సిర్గాపూర్‌లో బంధువుల దగ్గర ఉన్న సర్పంచ్‌ సాయాగౌడ్‌ తల్లి సోమవారం స్వగ్రామానికి రాగా చెక్‌పోస్టు వద్ధ వీఆర్‌ఏలు ఆమెను నిలిపివేసి సర్పంచ్‌కు సమాచారమిచ్చారు.

ఇతర గ్రామాల నుంచి ఎవరినీ రానీయొద్దనే గ్రామస్థుల నిర్ణయాన్ని గౌరవించిన సర్పంచ్‌ తన తల్లికైనా అదే కట్టడి వర్తిస్తుందని తెలిపాడు. దీంతో సర్పంచ్‌ తల్లి తిరిగి వెళ్లిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments