Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్... ఆ గ్రామంలోకి తల్లికైనా నో ఎంట్రీ

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (13:52 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్న ఓ గ్రామ సర్పంచ్‌ పంచాయతీ నిర్ణయానికి కట్టుబడి సొంత తల్లికే ప్రవేశం నిరాకరించాడు.

బంధువుల ఇంటి నుంచి వచ్చిన తల్లిని తిప్పి పంపించేశాడు. ఈ సంఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండల పరిధిలోని గోసాయిపల్లిలో జరిగింది.

సిర్గాపూర్‌ మండల కేంద్రంలో మూడు కుటుంబాలను క్వారంటేయిన్‌లో ఉంచడంతో అప్రమత్తమైన గోసాయిపల్లి వాసులు గ్రామ శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి బయటి నుంచి ఎవరూ రాకుండా కట్టడి చేశారు.

సిర్గాపూర్‌లో బంధువుల దగ్గర ఉన్న సర్పంచ్‌ సాయాగౌడ్‌ తల్లి సోమవారం స్వగ్రామానికి రాగా చెక్‌పోస్టు వద్ధ వీఆర్‌ఏలు ఆమెను నిలిపివేసి సర్పంచ్‌కు సమాచారమిచ్చారు.

ఇతర గ్రామాల నుంచి ఎవరినీ రానీయొద్దనే గ్రామస్థుల నిర్ణయాన్ని గౌరవించిన సర్పంచ్‌ తన తల్లికైనా అదే కట్టడి వర్తిస్తుందని తెలిపాడు. దీంతో సర్పంచ్‌ తల్లి తిరిగి వెళ్లిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments