Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మరో ఆరు నెలలు ఉండొచ్చు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Webdunia
గురువారం, 7 మే 2020 (19:26 IST)
కరోనా ప్రభావం మరో ఆరు నెలలు ఉండవచ్చని, అప్పటి వరకు ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

గురువారం మునుగోడు నియోజకవర్గంలో తన తల్లి కోమటిరెడ్డి సుశిలమ్మ పౌండషన్ ద్వారా పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సరుకులు పంచుతున్నామని తెలిపారు. 40వేల కుటుంబాలకు మూడు కోట్లతో నిత్యవసరాలు ఇస్తున్నామని చెప్పారు.

తన తల్లి సుశీలమ్మ పౌండేషన్ ద్వారా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు. రాజకీయాలకు అతీతంగా నిజమైన పేదలకు సరుకులు అందజేస్తున్నామన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.

ఆర్ధికంగా ఉన్న వాళ్ళు ఆపన్నహస్తం అందించాల్సిన తరుణం ఇది అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments