Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో మరో 60 కరోనా కేసులు

ఏపీలో మరో 60 కరోనా కేసులు
, బుధవారం, 6 మే 2020 (11:22 IST)
ఏపీలో గత 24 గంటల్లో 7,782 సాంపిల్స్ ని పరీక్షించగా 60 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. 
రాష్ట్రంలోని నమోదైన మొత్తం 1777 పాజిటివ్ కేసులకు గాను 729 మంది డిశ్చార్జ్ కాగా, 36 మంది మరణించారు.

ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1012. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 2,958 కరోనా కేసులు నమోదు కాగా, 126 మంది మృతిచెందారు.

దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ఇప్పటివరకు 14,182 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,694 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 33,514 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 
అత్యధికంగా మహారాష్ట్రలో 15,525 కరోనా కేసులు నమోదు కాగా, 617 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 6,245, ఢిల్లీలో 5,104, తమిళనాడులో 4,058, రాజస్తాన్‌లో 3,158, మధ్యప్రదేశ్‌లో 3,049, ఉత్తరప్రదేశ్‌లో 2,880 కరోనా కేసులు నమోదయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మకాలు తగ్గాలనే మద్యం ధరల పెంపు: ఎమ్మెల్యే రజనీ