Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే - ముంపు బాధితులకు రూ.10 వేలు

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (15:27 IST)
భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలతో తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ వరద ముంపు అధికంగా ఉంది. ఈ క్రమంలో ఈ వరద బాధిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం ఏరియల్ సర్వే చేశారు. 
 
భద్రాచలం నుంచి ఏటూరునాగారం దిశగా హెలికాప్టర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను వీక్షించారు. ప్రకృతి విపత్తుతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ఇరువైపులా జలమయమైన ప్రాంతాలు, నీటిలో చిక్కుకున్న గ్రామాల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి సీఎం శాంతి పూజలు చేశారు. భద్రాచలం వంతెనపై నుంచి గోదావరి పరిసరాలను పరిశీలించారు. గోదావరి కరకట్టను కూడా సీఎం వీక్షించారు.
 
ఈ సందర్బంగా భద్రాచలంలో వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తామని ప్రకటించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు చేపడుతామన్నారు. అదే విధంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ.వెయ్యి కోట్లతో కొత్త కాలనీని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 
 
ఇప్పటివరక మొత్తం 7274 కుటుంబాలను జిల్లా యంత్రాంగం పునరావస కేంద్రాలకు తరలించిందన్నారు. బాధిత కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని, ప్రతి కుటుంబానికి 20 కేజీల చొప్పున బియ్యం ఇస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments