Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరంలో మళ్లీ లాక్డౌన్? తుది నిర్ణయం కేసీఆర్‌దే : మంత్రి తలసాని

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (20:06 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఈ కేసులు అడ్డూఅదుపులేకుండా పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ లాక్డౌన్ అమలు చేయనున్నారనే రుమార్లు గుప్పుమంటున్నాయి.
 
వీటిపై ఆ రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయనీ, అందువల్ల లాక్డౌన్ విధించే అంశంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటారని తెలిపారు. 
 
అదేసమయంలో కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రజలు తమ ఇళ్లు వదిలి బయటకు రావొద్దంటూ ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. వారు పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. పైగా, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన కోరారు. 
 
అంతేకాకుండా, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అదేసమయంలో కరోనా అంశాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయ డ్రామాలకు తెరతీసిందని, రాష్ట్ర బీజేపీ నేతలు కరోనా విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచన చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments