Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో ఢిల్లీకి సీఎం కేసీఆర్‌!

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (12:55 IST)
టీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్‌ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారి హస్తిన పర్యటనలో ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, ఇతరత్రా నిధుల విడుదల, విభజన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రధానిని కలుస్తానని సీఎం కేసీఆర్‌ చాలా రోజుల కిందటే ప్రకటించారు.

‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు ముందు ఆయన ఢిల్లీకి వెళ్లినా.. ఓ పెళ్లి విందుకు హాజరై తిరిగి వచ్చారు. అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతోనే ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ కలవలేకపోయారని అప్పట్లో టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పాయి.

తాజా రాజకీయ పరిణామాలు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అన్నింటికంటే మించి మోదీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంతోపాటు కేంద్ర ఆర్థిక విధానాలను సీఎం కేసీఆర్‌ తప్పుబడుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈసారి మోదీ ఆహ్వానం మేరకే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లనున్నారనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. 17న కేసీఆర్‌ పుట్టిన రోజు.

ఆలోపే ఆయన ఢిల్లీ వెళతారని అంటున్నా.. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ముఖ్యులు ధ్రువీకరించటం లేదు. పర్యటన షెడ్యూల్‌ శుక్రవారం రాత్రి వరకు ఖరారు కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments