Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరులో తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సెషన్స్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (07:25 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలను ఆయన ఆదేశించారు. 
 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి అడ్డుకోవడమే అజెండాగా కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కేంద్రం ఆంక్షల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. 
 
అందుకే కేంద్రం చర్యలను అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడుతామని ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రగతికి కేంద్రం ఎలా అడ్డు తగులుతుందో ప్రజలందరికీ తెలియజేస్తామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై ఈ సమావేశాల్లో విపులంగా చర్చిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments