Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్న చిరంజీవి!

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (15:44 IST)
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతలు అందరూ ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ తప్పకుండా ఓటు వేయాల్సిందిగా వారిని అభ్యర్థిస్తున్నారు. కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఎన్నికలకు గడువు ఉండడంతో నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
 
ఈ నేపథ్యంలో ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. 
 
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆయన తరపున చిరు ప్రచారం చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు. 
 
ఈనెల 8వ తేదిన వికారాబాద్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభకి సోనియా రానున్నారు. ఈ సభకి చిరంజీవి కూడా హాజరవుతారని, ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇటీవలే కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు ఇతర అంశాలపై చర్చించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేశం కోసం తపన ఆపరేషన్ సింధూర్ సాంగ్ లో కనిపించింది : జెడి లక్ష్మీనారాయణ

త్రివిక్రమ్ - చెర్రీ కాంబినేషన్‌లో మూవీ?

నాకే ఎందుకు స్వామీ ఈ పరీక్ష : శివయ్యను ప్రశ్నిస్తూ మంచు విష్ణు

పెద్ద మనసుతో ఈ ధరిత్రిని - ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

కన్నడ తమిళం నుంచి పుట్టింది - కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

తర్వాతి కథనం
Show comments