Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 యేళ్ల బాలికతో 45 యేళ్ల వ్యక్తి వివాహం... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (14:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ బాల్య వివాహం జరిగింది. 13 యేళ్ల బాలికను 45 యేళ్ల వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఆ వ్యక్తికి మొదటి భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇపుడు ఆయన 13 యేళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. 
 
జిల్లాలోని నవీపేట్ మండలం అబ్బాపూర్ (బి) తండాలో అర్థరాత్రి 13 యేళ్ల మైనర్ బాలికను సాయిబ్ రావు అనే 45 యేళ్ల వ్యక్తికి ఇచ్చి బాల్య వివాహం చేశారు. అయితే, సాయిబ్ రావుకు అప్పటికే వివాహమై భార్య మృతి చెందింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం తనకంటే తక్కువ వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గ్రామస్థుల సహకారంతో ఈ వివాహం జరిగినట్టు తెలుస్తోంది.
 
దీనీపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకునే సరికి.. తన భార్యను తీసుకుని సాయిబ్ రావు అక్కడ నుంచి పరారైపోయాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న సాయిబ్ రావు దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments