బోరు బావిలో పడిన చిన్నారి మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 28 మే 2020 (08:10 IST)
మెదక్‌ జిల్లాలో బోరు బావిలో పడ్డ చిన్నారి సాయివర్ధన్‌ మృతిచెందాడు. దాదాపు 17 అడుగుల లోతులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. రెస్క్యూ సిబ్బంది బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు.

అయితే అప్పటికే చిన్నారి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం బోరు వేసిన అరగంటకే మూడేళ్ల చిన్నారి సాయివర్ధన్‌ బోరుబావిలో పడ్డాడు. పాపన్న పేట మండలంలో సాగుకోసం పంటపొలంలో బోరు వేశారు. అయితే వెంటనే కేసింగ్‌ ఏర్పాటు చేయలేదు.

దీంతో ఆటలాడుకుంటున్న మూడేళ్లచిన్నారి సాయి వర్ధన్‌ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

బాలుడిని వీలైనంత త్వరగా బావి నుండి బయటకు తీసేందుకు యత్నించారు. దాదాపు 12 గంటలపాటు రెస్క్యూ నిర్వహించి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు.

మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరు మన్నీరు అయ్యారు. ఆ గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. స్థానికులందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan Birth day: అప్పుడు ఒంటరి ఇప్పుడు పెద్ది లా ఎదిగిన కొణిదెల రామ్ చరణ్.

ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదు.. ఎక్కడపడితే అక్కడ తాకేవాడు.. మోనాలిసా

Charan: రామ్ చరణ్ క్షేమం - రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు- 27న గేమ్ గ్లింప్స్

యూత్ మూవీ తమిళంలో లాగే తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుంది - శ్రీ విష్ణు

చెన్నై లవ్ స్టోరీ ఆడియో హక్కులను సొంతం చేసుకున్న టీ సిరీస్ మ్యూజిక్ లేబుల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌ పోర్ట్‌ఫోలియో

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

వన్‌చెఫ్‌ను విడుదల చేసిన ఫిలిప్స్

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments