Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరు బావిలో పడిన చిన్నారి మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 28 మే 2020 (08:10 IST)
మెదక్‌ జిల్లాలో బోరు బావిలో పడ్డ చిన్నారి సాయివర్ధన్‌ మృతిచెందాడు. దాదాపు 17 అడుగుల లోతులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. రెస్క్యూ సిబ్బంది బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు.

అయితే అప్పటికే చిన్నారి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం బోరు వేసిన అరగంటకే మూడేళ్ల చిన్నారి సాయివర్ధన్‌ బోరుబావిలో పడ్డాడు. పాపన్న పేట మండలంలో సాగుకోసం పంటపొలంలో బోరు వేశారు. అయితే వెంటనే కేసింగ్‌ ఏర్పాటు చేయలేదు.

దీంతో ఆటలాడుకుంటున్న మూడేళ్లచిన్నారి సాయి వర్ధన్‌ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

బాలుడిని వీలైనంత త్వరగా బావి నుండి బయటకు తీసేందుకు యత్నించారు. దాదాపు 12 గంటలపాటు రెస్క్యూ నిర్వహించి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు.

మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరు మన్నీరు అయ్యారు. ఆ గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. స్థానికులందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments