Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఎమ్మెల్సీ కవిత వద్ద సీబీఐ విచారణ ప్రారంభం

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (13:06 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో భారత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కె.కవిత పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆమె వద్ద సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం సీబీఐ అధికారుల బృందం ఆదివారం ఉదయం హైదరాబాద్ నగరంలోని కవిత నివాసానికి చేరుకున్నారు. 
 
కాగా, ఈ కేసులో కవిత వద్ద విచారణకోసం ఆరో తేదీని సూచిస్తూ సీబీఐ ఓ లేఖను రాసింది. ఆ రోజున తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నందున 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని తెలుపుతూ ప్రత్యుత్తరం రాశారు. దీంతో సీబీఐ అధికారులు ఆదివారం విచారిస్తామని సమాచారం ఇవ్వగా, అందుకు కవిత అంగీకరించారు. ఈ క్రమంలో సీబీఐ అధికారుల బృందం ఆదివారం ఆమె నివాసానికి చేరుకున్నారు. 
 
మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కాములో తన పేరు ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన దరిమిలా ఆమె న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్టు సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ తన ఇంటి వద్దకు రావొద్దని కోరారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటికి వెళ్లే మార్గంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments