Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఎమ్మెల్సీ కవిత వద్ద సీబీఐ విచారణ ప్రారంభం

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (13:06 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో భారత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కె.కవిత పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆమె వద్ద సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం సీబీఐ అధికారుల బృందం ఆదివారం ఉదయం హైదరాబాద్ నగరంలోని కవిత నివాసానికి చేరుకున్నారు. 
 
కాగా, ఈ కేసులో కవిత వద్ద విచారణకోసం ఆరో తేదీని సూచిస్తూ సీబీఐ ఓ లేఖను రాసింది. ఆ రోజున తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నందున 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని తెలుపుతూ ప్రత్యుత్తరం రాశారు. దీంతో సీబీఐ అధికారులు ఆదివారం విచారిస్తామని సమాచారం ఇవ్వగా, అందుకు కవిత అంగీకరించారు. ఈ క్రమంలో సీబీఐ అధికారుల బృందం ఆదివారం ఆమె నివాసానికి చేరుకున్నారు. 
 
మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కాములో తన పేరు ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన దరిమిలా ఆమె న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్టు సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ తన ఇంటి వద్దకు రావొద్దని కోరారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటికి వెళ్లే మార్గంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ టైటిల్ ప్రదీప్ మాచిరాజు కు కలిసివస్తుందా !

Mohanlal: లూసిఫర్‌కు మించి మోహన్ లాల్ L2 ఎంపురాన్ వుంటుందా !

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments