Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నేడు 74 లక్షలకు పైగా ఖాతాలకు రూ.1500 చొప్పున నగదు బదిలీ

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:26 IST)
కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ తో నిరుపేదలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అలాంటివారికి కొద్దిమేర ఊరట కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది.

నేడు 74 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలకు రూ.1500 చొప్పున నగదు బదిలీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మేర ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు.

అందుకోసం మొత్తం రూ.1,112 కోట్లు కేటాయిస్తున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి ఆయా బ్యాంకులకు బదిలీ చేశామని తెలిపారు. 

''కరోనా సమయంలో పేద ప్రజలకు మద్దతుగా సీఎం కేసీఆర్ వాగ్దానం చేసినట్లు... తెలంగాణలో సుమారు 74 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో నేడు రూ.1500 జమకానున్నాయి. ఇందుకోసం రూ. 1,112 కోట్లు ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసింది" అని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments