Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BudgetSession2019 : మా నాన్న పథకాన్ని కాపీ కొట్టారు : తెరాస ఎంపీ కవిత

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (15:10 IST)
తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కాపీ కొట్టారని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం లోక్‌సభలో తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ 2019-20 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఇందులో చిన్నసన్నకారు రైతులకు యేడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తామని, ఈ పథకాన్ని 2018 డిసెంబరు నుంచే అమలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 
 
దీనిపై ఎంపీ కవిత స్పందించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని వ్యాఖ్యానించారు. రైతుబంధు ద్వారా యేడాదికి రెండు సార్లు ప్రతి ఎకరానికి రూ.5000ల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం యేడాదికి రూ.6000 మాత్రమే ప్రకటించిందని... అది కూడా మూడు విడతల్లో ఇస్తామని తెలిపిందని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినదే అయినా... ఈ పథకాన్ని మరింత మెరుగు పరచాల్సి ఉందన్నారు. ఐదు ఎకరాలులోపు భూమి గల రైతులకు ఏడాదికి రూ.6000 ఇస్తామని చెప్పడం వల్ల కొంతమంది రైతులకు మాత్రమే ఇది మేలు చేకూర్చుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments