ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థిని శీలాన్ని కాటేసిన కామాంధుడు...

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (07:53 IST)
హైదరాబాద్ నగరంలోని రహమత్ నగర్‌లో ఓ డిగ్రీ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. పెళ్లి పేరుతో నమ్మించిన ఇంటికి పిలిచిన బీటెక్ విద్యార్థి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రహమత్‌నగర్‌ సమీపంలోని కార్మికనగర్‌లో నివసించే విద్యార్థిని (23) బీకాం చదువుతోంది. అదేప్రాంతానికి చెందిన బీటెక్‌ విద్యార్థి రాజు(23) ఆమెతో మాట్లాడాలని శుక్రవారం ఇంటికి పిలిచాడు. 
 
పెళ్లి విషయమై మాట్లాడుకుందామని చెప్పడంతో ఆ యువతి అతని మాటలు నమ్మి ఇంటికి వచ్చింది. ఇదే అదునుగా భావించిన బిటెక్ విద్యార్థి.. ఆమెను ఇంట్లో బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న యువతి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments